క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్ ... గెలుపు పై ధీమా....
తూప్రాన్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో పోటీ చేసిన బిఆర్ఎస్ అభ్యర్థులు ఫలితాలకు ముందే క్యాంపుకు తరలివెళ్లారు శుక్రవారం కౌంటింగ్ లో ఫలితాలు ఎలా వచ్చినా ముందుగానే బిఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపుకు తరలి వెళ్లారు బిఆర్ఎస్ పార్టీ తూప్రాన్ మున్సిపాలిటీ ఎలాగైనా కైవాసం చేసుకోవాలని ఉద్దేశంతో అభ్యర్థులను చేజారకుండా ముందు జాగ్రత్తగా క్యాంపుకు తీసుకొని వెళ్లారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల తో క్యాంపు కు బయలుదేరారు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై 16 వార్డుల ఫలితాలు వెల్లడి అయ్యే వరకు ఏ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటాయో వేచి చూడాల్సిందే ఇరు పార్టీల నాయకులు గెలుపు మాదే అంటే మాదే అని అంచనాలు వేసుకుంటున్నారు పోలింగ్ సరళి మాకే అనుకూలంగా ఉందని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు


