బానోత్ శ్రీనివాస్ నాయక్ నామినేషన్ దాఖలు...
మేడ్చల్, (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 9వ వార్డు నుండి బానోత్ శ్రీనివాస్ నాయక్ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం డబిల్ పూర్ భారత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రంలో 9వ వార్డు సోమారం నుండి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బానోత్ శ్రీనివాస్ నాయక్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతోనే తాను ప్రజా సేవ చేసేందుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల్లోకి వస్తున్నట్లు చెప్పారు. 9వ వార్డు ప్రజలు తనను గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో పాండు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ప్రజల కోసం పనిచేసే తనను బిఆర్ఎస్ పార్టీ తరుపున కౌన్సిలర్ గా గెలిపించాలని శ్రీనివాస్ నాయక్ ఓటర్లను అభ్యర్థించారు.


