భూ బాధితుల సమస్యను పరిష్కరించండి....
రాజనర్సింహా...
By Prajaswaram
On
మనోహరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు తక్షణమే పరిహారం అందేలా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ రాజనర్సింహా కోరారు. మంగళవారం తహశీల్దార్ ఆంజనేయులును కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులకు న్యాయం చేయాలని విన్నవించగా, తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు సాదు సత్యనారాయణ, పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ను సర్పంచ్ బృందం సన్మానించింది.
Latest News
10 Feb 2026 20:35:12
తూప్రాన్, ఫిబ్రవరి 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు...


