రెండు రోజుల్లో ఏఈఓకు సమాచారం ఇవ్వాలి....

వ్యవసాయ శాఖ అధికారులు....

రెండు రోజుల్లో ఏఈఓకు సమాచారం ఇవ్వాలి....

పంట నమోదు చేయకపోతే నష్టం తప్పదు

దొమ్మాట రైతు వేదికలో పంట వివరాల నమోదు

దౌల్తాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజాస్వరం):

 

దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదిక పరిధిలోని, సూరంపల్లి, లింగరాజుపల్లి గ్రామ శివారుల్లో పొలాలు సాగు చేస్తున్న రైతులు తమ పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

ముఖ్యంగా పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసిన రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్‌తో పాటు హాజరై పంట వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వం ద్వారా పంటల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు రైతుల వివరాలు సేకరిస్తున్నందున, సంబంధిత రైతులు రెండు రోజులలోపు వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ కుమార్ (ఏఈఓ) వద్ద సమాచారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పంట వివరాలు నమోదు చేయని రైతులకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధి, కొనుగోలు కేంద్రాల సౌకర్యాలు అందకపోవచ్చని అధికారులు హెచ్చరించారు.

ఈ ప్రక్రియ దొమ్మాట రైతు వేదికలో నిర్వహించబడుతుందని, రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ సమాచారాన్ని తోటి రైతులకు తెలియజేయాలని కోరారు.

Latest News

ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి... ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
జగదేవ్ పూర్,  ఫిబ్రవరి11(ప్రజాస్వరం):   పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అని వట్టిపల్లి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ అన్నారు.మండలంలోని వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....
రెండు రోజుల్లో ఏఈఓకు సమాచారం ఇవ్వాలి....
పోలింగ్ ప్రశాంతంగా జరగాలి..
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ.....
115 దేశీదారు బాటిళ్లు స్వాధీనం....
భూ బాధితుల సమస్యను పరిష్కరించండి....