ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి

ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి

దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు ఎనలేనివి.....
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి 

మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం)

Read More మెదక్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భారత దేశానికి చేసిన సేవలు ఎనలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ సామాజిక, రాజకీయ,సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాణించిన ఇందిరా గాంధీ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. పరిపాలన లో ఇందిరమ్మ చూపిన తెగువ దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసనీయమన్నారు. తలలు పండిన రాజకీయ నాయకుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసిన గొప్ప మహిళా నేత ఇందిరమ్మ అని కొనియాడారు. ఇందిరమ్మ అంటేనే ఇండియా అనే విదంగా జనం హృదయాల్లో చోటు సంపాదించుకున్న భారతీయ వీర వనిత ఇందిరమ్మ అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తి తో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ గూడూరి కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగ మోహన్ గౌడ్, బొజ్జ పవన్, శంకర్ గౌడ్, హరిత నర్సింగ్ రావ్, గోదల జ్యోతి, కృష్ణ, గాడి రమేష్, స్వరూప, సుఫీ తదితరులు పాల్గొన్నారు.

Read More రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి