మెదక్ లో భారి ర్యాలీ

మెదక్ లో భారి ర్యాలీ

ధన-మాన-ప్రాణ రక్షణ కోసం పోలీస్ శాఖ కృషి.... 
సుమారు 300 మంది 2 కె రన్....

మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం)

Read More కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ   కీలక నిర్ణయం

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి ని పురస్కరించుకొని శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మెదక్ లో ఉదయం నిర్వహించిన 2 కె రన్ లో స్థానిక యువత, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ పరుగు కార్యక్రమాన్ని మెదక్ అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ బోధన్ చౌరస్తా నుండి ప్రారంభమై పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ధన-మాన-ప్రాణ రక్షణ కోసం పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, యువత, అధికారులు, పోలీస్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, మహేష్, రాజా శేఖర్ రెడ్డి, జార్జ్, శైలందర్, ఎస్ఐ లు సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

Read More బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి