డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):
అమీన్ పూర్ సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పడిన అమీన్ పూర్, బీరంగూడ డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ కృష్ణా నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ప్రారంభించిన శనివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు కాలనీ ముఖద్వారం నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందించిన దాసు యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో
అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


