సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి....
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులను పరిస్థితి ఆగం....
క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలి.....
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం పద్మ దేవేందర్ రెడ్డి....
కలెక్టర్ రాహుల్ రాజ్ కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత...
మెదక్ డిసెంబర్ 29 (ప్రజా స్వరం)
సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని, లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అయోమయంలో జిల్లా రైతంగం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూర్ నుండి ఘనపూర్ ఆయకట్టకు నీటిని విడుదల చేయిస్తారా, లేదా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే ఘనపూర్ ఆయకట్ట కింద పంటలు సాగుతాయని, ప్రభుత్వం ఇప్పటికీ సింగూర్ నీల విషయంలో అధికారికంగా ప్రకటన చేయకపోవడం రైతులను అయోమయానికి గురి చేస్తుందని ప్రభుత్వం మొండి వైఖరి తాగదని ఎదవ చేశారు. బిఆర్ఎస్ అయంలో ప్రతి పంటకు నీళ్లు ఇచ్చి పంట కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది అని అన్నారు. సింగూర్ నుండి నీళ్లను హైదరాబాద్ కు తీసుకెళ్లకుండా రతన్య చర్యలు ఏర్పాటు చేసి,మెదక్ జిల్లాకె సింగ్ నీళ్లు అంకితం చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని మండిపడ్డారు. వానకాలం జరిగిన నష్టపరిహారం ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగూర్ నుండి నీటిని విడుదల చేస్తారా లేదా క్రాఫ్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తార అనే విషయమై ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నామని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, మాజీ ఎంపీపీలు కొత్తపల్లి కిష్టయ్య,దుర్గయ్య, మాజీ రైతుబంధు జిల్లా అధ్యక్షులు సోములు,మాజీ కౌన్సిలర్లు విశ్వం, సోహెల్, పట్టణ పార్టీ కోకన్వీనర్లు కృష్ణ గౌడ్ లింగారెడ్డి, సర్పంచ్ లు సాంబశివరావు, మ్యకల సాయిలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


