యూరియా కోసం బారులు తీరిన రైతులు...

యూరియా కోసం బారులు తీరిన రైతులు...

చిన్న శంకరంపేట,  జనవరి 30 ( ప్రజాస్వరం ) :                          చిన్న శంకరంపేట మండలంలోని మడూర్ గవలపల్లి లో యూరియా కోసం ఉదయం నుండి రైతులు దుకాణాల ముందు బారులు తీరారు, వరి నాట్లు వేసి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని ఓవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు సూచిస్తున్న ఇక్కడ మాత్రం యూరియా కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు, యూరియా సంచుల కోసం మహిళా రైతుల సైతం ఉదయం నుండే వరుసలు నిలబడి ఉన్నారు, నాట్లు వేయడం జరిగిందని యూరియా లేఖ వరి ఎర్రబడుతుందని ఉదయం ఇంటి వద్ద పనులను మానుకొని యూరియా కోసం రావడం జరిగిందని అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ఒక రైతుకు ఒక సంచి ఇవ్వడం జరుగుతుందని, మరికొన్ని చోట్ల ఒక రైతుకు రెండు సంచులు యూరియా ఇవ్వడం జరుగుతుందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరారు, ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో మడూర్, శంకరంపేట, గవలపల్లి మహాలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణాలకు 1560 సంచులు రావడం జరిగిందని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని రైతులకు సరిపడా యూరియా అందించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....