18 సం నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి..
తహసిల్దార్ గ్రేస్ బాయి
By Prajaswaram
On
నార్సింగి, జనవరి 25 (ప్రజాస్వరం):
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని నార్సింగ్ తహసిల్దార్ గ్రేస్ బాయ్ అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ గ్రేస్ బాయ్, ఎస్సై సృజన, ఆర్ఐలు శ్రీధర్, మేఘన, సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్, బి ఎల్ వో లు రేషన్ డీలర్లు, విద్యార్థులు అందరూ కలిసి తాసిల్దార్ కార్యాలయం నుండి పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద బి ఎల్ ఓ లకు సర్టిఫికెట్ పెన్ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటును అమ్ముకోకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు వజ్రాయుధమని వరన్నారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


