వైద్యులు సమయపాలన పాటించాలి..
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
By Prajaswaram
On
రామాయంపేట, జనవరి. 25( ప్రజాస్వరం):
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సిహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ...వైద్యులు , సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులన్నీ అందుబాటులో ఉండాలన్నారు.
రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


