కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో బీజేపీ నాయకుల పూజలు...

కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో బీజేపీ నాయకుల పూజలు...

ప్రజాస్వరం , మనోహరాబాద్ : 

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బిజెపి) మనోహరాబాద్ మండల శాఖ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాళ్లకల్ గ్రామంలోని ప్రసిద్ధ బంగారమ్మ ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు, కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ సేవకే అంకితం: దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాళ్లకల్ బంగారమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.సుపరిపాలన - సంక్షేమం వంటి కార్యక్రమాలు మోడీ  నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు దూసుకుపోతోందని, పేదల సంక్షేమానికి ఆయన అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటా వెలుగులు నింపుతున్నాయని కొనియాడారు.ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని స్వచ్ఛతా కార్యక్రమాలు, మొక్కలు నాటడం మరియు పేదలకు పండ్లు పంపిణీ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను మండలంలో చేపడుతున్నట్లు చెప్పారు.ఈ పూజా కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు కమ్మరి నరేందర్ చారి, ఎల్ ప్రభాకర్ గౌడ్, కూచారం ఉప సర్పంచ్ మజ్జతి ఆంజనేయులు, నర్సింలు ముదిరాజ్, ఎర్ర కృష్ణ, నారం రాజు, ఆనంద్ యాదవ్, రమేష్, రచ్చ శ్రీకాంత్, పరం నరేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్.... విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్....
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...
త్యాగాల స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకుందాం....
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ....
కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో బీజేపీ నాయకుల పూజలు...
పర్కిబండ లో ప్రజా పాలన దినోత్సవం...
అయోధ్య రామమందిరం నమూనాలో వినాయక మండపం...
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు....