పార్క్ వుడ్ టవర్స్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలోని పార్క్ వుడ్ టవర్స్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు ఉత్సాహంగా పాల్గొని చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించడంతో పాటు చిన్నారుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీంతో పార్క్ వుడ్ టవర్స్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Latest News
05 Sep 2026 15:48:23
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్...


