తూప్రాన్ లో కాంటైనర్ లో మంటలు చెలరేగి 8 కార్లు .....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21:
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ లో నుండి మంటలు చెలరేగాయి.. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు ఖాళీ బూడిది అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Latest News
21 May 2026 14:31:09
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21: పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్...


