మైత్రి ఫౌండేషన్‌తో సామూహిక అక్షరాభ్యాసాలు

మైత్రి ఫౌండేషన్‌తో సామూహిక అక్షరాభ్యాసాలు

గుమ్మడిదల, జనవరి 23(ప్రజాస్వరం):

వసంత పంచమి సందర్భంగా గుమ్మడిదల ప్రాథమిక పాఠశాలలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి మౌనిక ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులతో అక్షరాభ్యాసాలు నిర్వహించారు.

వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతీ మాత పూజ చేసి చిన్నారులకు అక్షరాలు దిద్దించారు. అనంతరం పలక, బలపం వంటి అక్షరాభ్యాస పూజ సామగ్రి పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసీదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, మాదనర్సింలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...