మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్....
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 1 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 390 వ ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం, ఫంక్షన్ హాల్ సమీపంలో చేపట్టడం జరిగింది. సీసీ రోడ్డుకు ఇరువైపులా ఏపుగాపెరిగిన ముళ్ల పొదలను తొలగించడంతోపాటు, ఫంక్షన్ హాల్ లో చెత్తాచెదారాన్ని చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు జిన్న కృష్ణ, మన్నె తిరుపతి, సరిత పరమేష్ గౌడ్ , పిట్ల వేణు, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు,మేకిన్ యువత,పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
01 Mar 2026 20:33:15
చిన్న శంకరంపేట, మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...


