కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం. -పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల.

కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం. -పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల.

కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం.
-పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల.

మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్13(ప్రజా స్వరం):

Read More అభివృద్ధి, అవసరాలు, యోగ క్షేమాలు తీర్చడమే లక్ష్యం...ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు...


సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ ఆదాలత్ లతో కక్షిదారులకు రాజీమార్గమని,రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు.శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.లోక్ అదాలత్ లో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వ వాతావరణముతో కలుసుకొని,కోపాలు,భావోద్వేగాలు లేకుండా,డబ్బులు,సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురికి సంతోషకరణమని,కక్షి దారులు రాజీమార్గంలో వచ్చినట్లయితే,ఒక ప్రక్క కోర్టుకు,మరొక ప్రక్క సమయం కూడా వృధా కాదని,ఇతర అత్యవసర కేసులో పరిష్కరించుటకు సమయం దొరుకుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్షి దారులకు,ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ లోక్ అదాలత్ లో మంథని కోర్టులో 271  కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియరు సివిల్ జడ్జి వి.భవాని,అడిషనల్  జూనియర్ సివిల్ జడ్జీ ఎ.సుదారాణి,ద్వితీయ శ్రేణి  న్యాయాదికారిణి అనురాధ,రెవెన్యూ డివిజనల్ అధికారి బి.సురేష్,గోదావరిఖని ఏసిపి మడత రమేష్,‌అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి బాబు,తహసీల్దార్ కుమార స్వామి న్యాయవాదులు,వివిధ బ్యాంకుల అధికారులు,కోర్టు సిబ్బంది,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More తైబజార్ రద్దు పట్ల కూరగాయలు పండించే రైతుల హర్షం...

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం