కల్లు కంపౌండ్లలో భద్రతా చర్యలు తప్పనిసరి : ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్

కల్లు కంపౌండ్లలో భద్రతా చర్యలు తప్పనిసరి : ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్

కల్లు కంపౌండ్లలో భద్రతా చర్యలు తప్పనిసరి. ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ స్పష్టమైన ఆదేశాలు

 శామీర్ పేట సెప్టెంబర్ 12(ప్రజాస్వరం)శామీర్ పేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ ఉమ్మడి శామీర్ పేట మండలంలోని కల్లు కంపౌండ్ నిర్వాహకులతో శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశంలో కల్లు కంపౌండ్లలో తీసుకోవలసిన భద్రతా చర్యలపై చర్చించారు. ప్రతి కంపౌండ్‌లో తప్పనిసరిగా సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేయాలని, చట్టానికి లోబడి సక్రమంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.
అదేవిధంగా, నిర్వాహకులకు ఒక నోటీసు జారీ చేసి, పై సూచనలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రత కాపాడడంలో శామీర్ పేట పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేస్తారని, ప్రజల సహకారంతో మరింత సురక్షిత వాతావరణం నెలకొల్పుతామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్సైలు శశివర్ధన్ రెడ్డి, దశరథ్ పాల్గొన్నారు.

Read More కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు ; మంత్రి శ్రీధర్ బాబు.

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం