రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే : -రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
జాతీయ లోక్ ఆదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.
-లోక్ ఆదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది.
-రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే.
-రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
రామగుండం,పెద్దపల్లి,సెప్టెంబర్12(ప్రజా స్వరం):
రాజీమార్గం రాజమార్గమని కక్షలు,కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని,రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు.ఈ నెల 13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు.రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు ఆస్తి విభజన కేసులు కుటుంబపరమైన నిర్వాహణ కేసులు వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు బ్యాంకు రికవరీ,టెలిఫోన్ రికవరీ కేసులు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ కేసులో ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.