ఉత్తమ సేవ చేసిన వారికే మంచి గుర్తింపు. -అవార్డు గ్రహీతకు మంథని మాజీ ఎమ్మెల్యే సన్మానం.
By Prajaswaram
On
ఉత్తమ సేవ చేసిన వారికే మంచి గుర్తింపు.
-అవార్డు గ్రహీతకు మంథని మాజీ ఎమ్మెల్యే సన్మానం.
మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్13(ప్రజా స్వరం):
విద్యార్ధులకు మంచి విద్యాబోధన అందిస్తూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో సేవలు అందించే వారికే మంచి గుర్తింపు లభిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకున్న మంథనికి చెందిన గీట్ల భరత్రెడ్డిని శనివారం మంథనిలోని ఆయన నివాసంలో కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం మంథనికే గర్వకారణమన్నారు.అంకితభావంతో పని చేస్తూ విద్యార్ధుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు.ఆయన వెంట పలువురు ఉన్నారు.
Related Posts
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...