వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం
By Prajaswaram
On
హైదరాబాద్, (ప్రజాస్వరం ) :
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రీ-బడ్జెట్ సమావేశాల భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతు సంక్షేమం మరింత బలోపేతం చేయడం, పంట ఉత్పాదకతను పెంచడం, సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఆధునిక వ్యవసాయ విధానాలను విస్తృతంగా అమలు చేయడం వంటి అంశాలపై సమావేశంలో సవివరంగా చర్చించాం. వ్యవసాయ రంగం స్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన కీలక చర్యలపై కూడా దృష్టి సారించాం. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News
13 Mar 2026 21:25:03
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...


