కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు

కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు

 

మేడ్చల్ / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు.శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకుని, వేద పండితులు మరియు విద్యార్థులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.తరువాత వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కారం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల గురించి టిటిడి ఛైర్మెన్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.వేద పండితులు, విద్యార్థులు మరియు సిబ్బందికి సమస్యలు ఉన్నాయా అని కూడా తెలుసుకున్నారు. పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ గూడ శ్రీనివాస శర్మ అవధాని మాట్లాడుతూ, ఈ పాఠశాల 1981 సంవత్సరంలో స్థాపించబడిందని, ప్రస్తుతం 132 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని టిటిడి ఛైర్మెన్‌కు తెలిపారు.

Latest News

రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.... రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు....
ప్రజాస్వరం  : జగదేవ్ పూర్,ఏప్రిల్ 28    ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కావున రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం...
మేడ్చల్ లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం....
బాలల రక్షణకు చట్టాలు....
బాల్య వివాహాల నిర్ములన పై అవగాహనా.... 
నీటి సమస్య తీర్చేందుకు నూతన బోరు....
మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ....
కేంద్రంప్రభుత్వం స్వయంగా జన గణన నమోదు..