ఈ పరిశ్రమ మాకొద్దంటు జె,సి, కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 23 ( ప్రజాస్వరం):
చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మాకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సుధాకర్తో పాటు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు అందరు కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఇప్పటికే రెండు పరిశ్రమల ద్వారా నీరు కలుషితమై పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని పాత టైర్ల ద్వారా నూనె మరియు పౌడర్ తయారు చేయడం తో వ్యర్థ పదార్థాలు పూర్తిగా చెరువులో కలుస్తాం కావడం జరుగుతుందని ఈ కంపెనీ మాకొద్దు అంటూ అదనపు కలెక్టర్ నగేష్ కు గ్రామస్తుల ఫిర్యాదు చేశారు. కలుషిత నీరు తీసుకెళ్లి ఆయనకు చూపించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారం గ్రామ శివారులో గతంలో రెండు కంపెనీలు ఉన్నాయని పాత టైర్ల ద్వారా నూనె, పౌడర్, తయారు చేయడం జరుగుతుందని వాటి ద్వారా వెలువడే కలుషితనీరు చెరువులలో చేరి కనీసం పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని, పక్కనే తమ పొలాల వద్ద బోర్లలో సైతం కలుషిత నీళ్లు రావడం జరుగుతుందని దీంతో పంటలు కూడా దెబ్బతింటున్నాయని, వారు వాపోయారు, కంపెనీ పక్కన తమ పంట పొలాలలో వేసిన బోర్లలో నీరు సైతం కలుషితం కావడం జరిగిందని దీంతో పంటలు ఎండిపోవడం జరుగుతుందని రైతులను తీవ్రంగా నష్టపోతున్నామని వారు తెలిపారు. మళ్లీ ఇప్పుడు నూతన పరిశ్రమ ఏర్పాటుకు భూమి చదును చేయడం జరుగుతుందని అధికారులు ఆ కంపెనీ వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత రమేష్ ఉపసర్పంచ్ సుధాకర్ తో పాటు గ్రామస్తులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


