రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం....  

డాక్టర్ మోహన్ నాయక్

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం....   

రామాయంపేట జనవరి.22 ( ప్రజాస్వరం):                             మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలోఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ

 జర్నలిస్టు "కమ్మరీ వెంకట రాములు" ఇంటికి వెళ్లి పరామర్శించి,

ఆయనకు ఆర్థిక సహాయం అందించడానికి లీలా గ్రూపు చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ముందుకు వచ్చారు. బుధవారం నాడు ఆయన రాష్ట్ర టీయూడబ్ల్యుజే iju రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి . జి.శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో రాములు ఇంటికి వెళ్లి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టియుడబ్ల్యూజే కోశాధికారి ఊడేం దేవరాజు,రామాయంపేట ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి రాము, సభ్యులు బల్ల యాదగిరి, గజ్జల రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు