మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరత...

కిరణ్ కుమార్....

మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరత...

ప్రజాస్వరం : మేడ్చల్, ఏప్రిల్ 15 

 

మేడ్చల్పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరతను తీర్చాలని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు నీటి సమస్య వెంటాడుతుందని అన్నారు. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా కళాశాలలో ఎటువంటి నీళ్ల సౌకర్యం లేదని దానివల్ల కళాశాల పక్కనే ఉన్న కార్వీ గుంతలలో విద్యార్థులు స్నానాలు చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్వారీలో స్నానం చేయడానికి వెళ్లిన విద్యార్థులు క్వారీలో పడి చనిపోయే ప్రమాదం ఉందని , జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ,జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన నిలబడి అందరిని ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..