ఇస్లాంపూర్లో వ్యక్తి ....
By Prajaswaram
On
ప్రజాస్వరం , తూప్రాన్ :
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో అర్ధరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొండ శ్రీరాములు (50)అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.శ్రీరాములు బోర్వెల్ పనులు చేస్తూ సంపాదించిన డబ్బులను కుటుంబానికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడని కుటుంబం లో కలహాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. భార్య సబిత, కుమారుడు భారత్ లు లే ఈ హత్య చేసి తూప్రాన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడు శ్రీరాములుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Latest News
19 Sep 2026 16:05:46
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో కొంత మంది విద్యుత్ అధికారుల పనితీరు విమర్శలకు తవిస్తుంది.అయిన వారికి అరటి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్న చందంగా తయారయింది.పట్టణంలో...


