గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ....
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు ఆదివారం విడుదల అయిన ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో 2 వ ర్యాంకు సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, కళాశాల అధ్యాపక బృందం సహకారంతో ఈ మార్కులు సాధించినట్టు విద్యార్థిని అక్షర రెడ్డి తెలిపారు. ఫలితాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు,కళాశాల యాజమాన్యం అమ్మాయికి అభినందనలు తెలిపారు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న అమ్మాయి ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడంతో సర్పంచ్ శ్రీలత రెడ్డి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేసారు.10 వ తరగతి వరకు తూప్రాన్ గీతా హై స్కూల్ లో చదువు కొని 577 మార్కులు సాధించారు ఇష్టం తో చదవడం వల్ల మంచి మార్కులు సాధించడం సాధ్యం అవతుందని అక్షరరెడ్డి తెలిపారు.


