న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....

మేడ్చల్, ఏప్రిల్ 11 (ప్రజాస్వరం):

 

న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కొషి ఆదేశాల మేరకు తెలంగాణ న్యాయ సెక్రటరీ పంచాక్షరీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును మేడ్చల్ మండలం లోని కండ్లకోయ,గౌడవెళ్లి గ్రామాలలో సంచార వాహనం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని అన్నారు. వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమానికి సంబంధించిన చట్టాలు, పథకాల గురించి అవగాహన కల్పించడం, సమాజంలోని బలహీన వర్గాలకు హక్కులు, గిరిజన హక్కులు, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలు, న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన, చట్టాల పై ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సదస్సులో న్యాయ సేవధికార సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజు,మేడ్చల్ ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వి. శ్రావణి యాదవ్ తో పాటు న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.

Latest News

గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ .... గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ....
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు...
సంబంధిత ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి....
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన 'స్ఫూర్తి' విద్యార్థులు...
తూప్రాన్ ఓ విందులో గొంతులో మాంసం ముక్క... 
గీతా జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు... 
నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....