క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

రాష్ట్ర పోటీల్లో ప్రతిభ చూపిన  జట్టుకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 పటాన్‌చెరు, జనవరి 04( ప్రజా స్వరం)

 పటాన్‌చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ విభాగంలో రెండవ స్థానం, అలాగే మార్చ్ ఫాస్ట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన సంగారెడ్డి జిల్లా జట్టుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీలు బహూకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో కూడా ఇదే స్పూర్తితో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం, సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గురువా రెడ్డి, బిహెచ్ఇఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఐలేష్ యాదవ్, అలాగే అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..