న్యాయవాదుల రక్షణ చట్టాలు అమలు చేయాలి...

న్యాయవాదుల రక్షణ చట్టాలు అమలు చేయాలి...

 

మెదక్ డిసెంబర్ 16 (ప్రజా స్వరం) : 

Read More కాట్రియాల ఉపసర్పంచ్ గా  బాబు నాయక్

రాష్ట్రం లో న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై పట్టిష్టమైన రక్షణ చట్టాలను తీసుకుని రావాలని హుజూరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది సమూల రాంరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కోర్టు సముదాయ ప్రాంగణంలో ఆయన న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకునివచ్చి, వారి పై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న జూనియర్ న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 41 సీఆర్పిసి  కాకుండా అడ్వకేట్ల పై జరుగుతున్న దాడుల విషయంలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకుని వస్తానని అన్నారు.  ప్రతి న్యాయవాదికి 5 లక్షల ఉండే ఇన్సూరెన్స్ ను 10 లక్షలకు పెంచే విధంగా ప్రభుత్వానికి విన్నవిస్తానని అన్నారు. తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మార్కంటి రాములు, ప్రతాప్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పోచయ్య, సంతోష్ రెడ్డి, రవీందర్, రవి గౌడ్, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More జవహర్ నగర్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల వినతి

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ