ఏసీబీ వలలో ఓయూ డీ ఈ
By Prajaswaram
On
హైదరాబాద్, (ప్రజాస్వరం) :
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో లో ఏసీబీ సోదాలు జరిపింది. లంచం తీసుకుంటూ బిల్డింగ్ డివిజన్ డి ఈ శ్రీనివాస్ ఏసీబీ కి రెడ్ హ్యాండ్ గా చిక్కాడు. ఓయూ లో సివిల్ కాంటాక్టర్ వద్ద డి ఈ శ్రీనివాస్ 11000 లంచం డీమాండ్ చేసాడు. డి ఈ శ్రీనివాస్ ఇంకా రెండు నెలల్లో రెటైర్ట్ అవనున్నాడు.
ఏసీబీ డీస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఓయూ మానేరు హాస్టల్ లో సివిల్ వర్క్స్ చేసిన కాంటాక్టర్, 14 లక్షల బిల్ పాస్ కావాలి అంటే పదకొండు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసాడు. కాంట్రాక్టర్ వారం రోజుల కింద ఫోన్ పే ద్వారా 5000 ఇచ్చాడు. తరువాత ఇంకో 6000 కోసం డిమాండ్ చేసాడు డీ ఈ శ్రీనివాస్ . బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు రైడ్స్ చేసి ఆరు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అన్నారు.
Latest News
17 Dec 2025 15:56:38
రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత


