క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 

 50 చర్చిలకు రూ.15 లక్షల పంపిణీ

క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం  :  : పట్నం మహేందర్ రెడ్డి 

మేడ్చల్ , డిసెంబర్ 16 (ప్రజాస్వరం) :

 
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుతూ భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వాన్ని పెంపొందించు దామిని  శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వీప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్  జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రారంభించారు. మేడ్చల్ లోని జేవియర్  గార్డెన్ లో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా పాల్గొని 50 చర్చిలకు 30 వేల చొప్పున 15 లక్షల నిధులను పంపిణీ మహేందర్ రెడ్డి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 2000 మంది క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన సామూహిక విందులో పాల్గొని సహా పంక్తి భోజనం చేశారు. క్రైస్తవులూ క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం క్రైస్తవులకు, మైనారిటీల ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు అవకాశం కల్పించిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ డీసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ,శాంతి సందేశం అందరూ అలవరచు కోవాలి అన్నారు.
ఆర్డీవో ఉపేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీవో సభ్యులు జైపాల్ రెడ్డి,హజ్ కమిటీ సభ్యులు ముజీబ్, మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పోచంపల్లి, అల్వాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, తుంకి రమేష్ తదితరులున్నారు.

Read More రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ