ఆర్డీవో కార్యాలయం ముందు కవిత భారీ ధర్నా.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : వికారాబాద్ , ఏప్రిల్ 15
వికారాబాద్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పరిగి మండలం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల రైతుల సాగు భూములను 'ఇండస్ట్రియల్ కారిడార్' పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమ్మతి లేకుండా భూసేకరణ చేయడం తప్పు అని ఈ ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో ధర్నా చేపట్టారు. రైతులకు భూములు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని డిమాండ్ చేశారు. వికారాబాద్ ఆర్డీఓ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఈ ధర్నాకు భారీగా తరలి వచ్చిన భూములు కోల్పోతున్న రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Latest News
25 Apr 2026 12:30:21
మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసింది.. ప్రజాస్వరం : చేగుంట , ఏప్రిల్ 25 ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని...


