నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....
నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం)

Read More ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబరులో నితన్య సిరి ని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ బోడుప్పల్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి సీనియర్ బ్లాక్ బెల్ట్‌గా గర్ల్స్ విభాగంలో కటా, వెపన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఉత్తమ రెఫరీగా సేవలందించడం విశేషమని ఎస్పీ అభినందించారు. ఇప్పటి వరకు నితన్య సిరి 11 బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ స్థాయి బంగారు పతకాలు, రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ సాధించడం ద్వారా తన క్రీడా ప్రతిభను నిరూపించిందని ఎస్పీ తెలిపారు. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఇంతటి విజయాలు సాధించడం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. నితన్య సిరి విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం మెదక్ పోలీస్ విభాగానికీ గర్వకారణం అని,ఇలాంటి ప్రతిభావంతులైన ఆడపిల్లలు సమాజానికి ఆదర్శం భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్‌ఐ శైలేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్ఐ నరేష్, మాస్టర్ రవీంద్ర కుమార్, స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి, తల్లిదండ్రులు నామ కృష్ణ–కీర్తినేత తదితరులు పాల్గొన్నారు.

Read More సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి