నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....
నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం)

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబరులో నితన్య సిరి ని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ బోడుప్పల్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి సీనియర్ బ్లాక్ బెల్ట్‌గా గర్ల్స్ విభాగంలో కటా, వెపన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఉత్తమ రెఫరీగా సేవలందించడం విశేషమని ఎస్పీ అభినందించారు. ఇప్పటి వరకు నితన్య సిరి 11 బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ స్థాయి బంగారు పతకాలు, రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ సాధించడం ద్వారా తన క్రీడా ప్రతిభను నిరూపించిందని ఎస్పీ తెలిపారు. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఇంతటి విజయాలు సాధించడం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. నితన్య సిరి విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం మెదక్ పోలీస్ విభాగానికీ గర్వకారణం అని,ఇలాంటి ప్రతిభావంతులైన ఆడపిల్లలు సమాజానికి ఆదర్శం భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్‌ఐ శైలేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్ఐ నరేష్, మాస్టర్ రవీంద్ర కుమార్, స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి, తల్లిదండ్రులు నామ కృష్ణ–కీర్తినేత తదితరులు పాల్గొన్నారు.

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..