కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు....
అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
కుండ భానుచందర్
ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 15
మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు దక్కింది.డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్ నగరం లోని రవీంద్రభారతిలో కుండ భానుచందర్ కు దళితరత్న అవార్డ్ ఎమ్మార్పీఎస్ కళామండలి అధ్యక్షులు NY అశోక్ మాదిగ చేతుల మీదుగా ప్రధానం చేశారు. కుండ బానుచందర్ చేసినట్టు అనేక సేవలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి, భానుచందర్ కు ఈ అవార్డు ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కుండ భానుచందర్ మాట్లాడుతూ దళిత రత్న అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇందుకు సహకరించిన పెద్దలకు, దళితరత్న అవార్డు రావడానికి , నా సేవలను నా ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం దళిత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు, నాకు సహరించిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కుండా భానుచందర్ పేర్కొన్నారు దళిత రత్న అవార్డు తీసుకున్న తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగిందని, దానికి అనుగుణంగా తప్పకుండా పని చేస్తానని ఉండ భానుచందర్ తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కళామండలి అధ్యక్షులు NY అశోక్ మాదిగ, అంబేద్కర్ జగ్జీవన్ రావు ఉత్సవ కమిటీ మెంబర్ రాపగా అశోక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాలకృష్ణ, బిక్షపతి, కుండ ప్రవీణ్, శివ, శివ కృష్ణ, బాల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.


