ఇంటర్ లో రాష్ట్ర స్థాయి లో నిలిచిన విద్యార్థుల కు సన్మానం.....
జిల్లా కలెక్టర్.....
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 15
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ గీతజూనియర్ కళాశాల లో చదువు తు ఇటీవల విడుదల అయినా ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో విద్యార్థులను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు ఘనంగా సన్మానించారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులను మెమెంటో, శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని గొప్పగా నిర్దేశించుకుని ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రా రెడ్డి, ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి, ఎంఈవో పర్వతి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ రజిని రాఘవేందర్ గౌడ్,వైస్ చైర్మన్ సమతా కాశిరెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపాల్ టి. రాజు,ఇంచార్జి ప్రిన్సిపాల్ సుధారాణి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


