విజేతగా బుల్స్ టీం
By Prajaswaram
On
ఎస్పీఎల్ సీజన్–5 విజేతగా బుల్స్ టీమ్
మేడ్చల్, (ప్రజాస్వరం):మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. 2025 అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొన్నాయి.టోర్నమెంట్ను బీసీసీఎస్ చైర్మన్ ఏ. చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీసీఎస్ బోర్డు సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్లో బుల్స్ జట్టు విజేతగా నిలువగా, వరం వారియర్స్ జట్టు రన్నర్స్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ కి మేడ్చల్ సీఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులుఅందజేశారు..ఈ టోర్నమెంట్కు జే. భూపాల్ జి. కృష్ణ, పోచయ్య (మాజీ సర్పంచ్), ఎం. నరసింహ, దేవేంద్ర రెడ్డి, చందర్ (మాజీ సర్పంచ్),భాను చందర్, రమేష్ (పోలీస్), నరేష్, కొండల్ రెడ్డి స్పాన్సర్లుగా వ్యవహరించారు.
Latest News
24 May 2026 17:17:58
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 : పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి...


