రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లుల్లో దించుకోవాలని తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ,ఎసై గంగధర్ తూప్రాన్ రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు తీసుకువచ్చిన వడ్లు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా, త్వరితగతిన దించుకోవడం ద్వారా నాణ్యత కాపాడబడుతుందని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, సమయానికి వడ్లను దించుకోవాలని అధికారులు హెచ్చరించారు.
Latest News
17 May 2026 14:10:58
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 : మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో...


