నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు....
మేడ్చల్, జనవరి 30 (ప్రజాస్వరం): ఎల్లంపేట మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు. 11వ వార్డు గోశిక అఖిలా సాయి, 12వ వార్డు దుడ్డు కల్పనా మాణిక్యరావు, 13వ వార్డు నుండి వీర్లపల్లి రాజమల్లారెడ్డి, భాగ్యరెడ్డి, ప్రణయ్ రెడ్డి, 14వ వార్డు నుండి గౌస్ ఖాన్, దాహుద్ ఖాన్, 23వ వార్డు నుండి వీర్లపల్లి భాగ్యరెడ్డి, జింకల నరేష్ లు నామినేషన్ పత్రాలను డబుల్ పూర్ లోని భరత్ బైబిల్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి కృషి చేస్తూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజలకు విస్తృత సేవలు చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న తమను ప్రజలు గెలిపించాలని కోరారు.


