పరేడ్ రిహార్సల్స్ పరిశీలించిన అదనపు ఎస్పీ....

పరేడ్ రిహార్సల్స్ పరిశీలించిన అదనపు ఎస్పీ....

మెదక్ జనవరి 25 (ప్రజాస్వరం):

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ రిహార్సల్స్‌ ను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. పరేడ్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ తో పాల్గొన్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, భద్రతా ఏర్పాట్ల పై ఆయన మార్గదర్శకాలు అందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐ జార్జ్, ఆర్‌ఐ శైలేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...