బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.....
యాదగిరి గౌడ్
తూప్రాన్ జనవరి 21 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఎన్నికల మేనిపెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ లకు రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలనీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఇమాంపూర్ యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని, అది అమలు చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఇమాంపురం యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించడం నమ్మకద్రోహానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీసీలకు న్యాయం చేయకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
బీసీలు రాష్ట్ర జనాభాలో కీలక భాగమని, వారికి రాజకీయంగా, సామాజికంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యాదగిరి గౌడ్ గారు అన్నారు. బీసీల రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తీవ్ర ప్రజా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు


