ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యం...
మాజీ మేయర్ మేకల కావ్య...
By Prajaswaram
On
జవహర్ నగర్, సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) :
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి చేసిన సేవతో సమానమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు.శుక్రవారం అమావాస్య పురస్కరించుకొని జవహర్ నగర్ లో మేకల అయ్యప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ.. మా కుటుంబం బికేఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో అధినేత మేకల అయ్యప్ప ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు గొప్ప వరమన్నారు. ప్రతి అమావాస్య బాలాజీ నగర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బండ కింది ప్రసాద్ గౌడ్, సుధాకర్ చారి ,యువజన విభాగం అధ్యక్షులు మేకల భార్గవరామ్,స్థానిక నాయకులు,పంతంగి సిద్ధులు యాదవ్,పొలాస సాయికుమార్,కూటికంటి వెంకటేష్ గౌడ్.పొలాస సాయికుమార్, మైనార్టీ నాయకుడు అహ్మద్ భాషా కార్యకర్తలు,కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News
11 Sep 2026 20:05:44
జవహర్ నగర్, సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) : ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి చేసిన సేవతో సమానమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్...


