జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో తుంకి రమేష్
శామీర్ పేట నవంబర్ 2 (ప్రజస్వరం)
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్స్ అభ్యర్థి నవీన్యాదవ్ గెలుపు లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఈ ఎన్నికలకు మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ అద్యక్షుడు తుంకి రమేష్ రహమత్ నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్యాదవ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలుచేశామని కాంగ్రెస్ అభ్యర్థికే తమ ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటి చైర్మన్ బొమ్మలపల్లి నర్సిహాయాదవ్, జిల్లా ఆర్టిఎ మెంబర్ జైపాల్ రెడ్డి, రాష్ట్ర హాజ్ కమిటి మెంబర్ ముజుబుద్దిన్, కాంగ్రెస్ నాయకులు భూమిరెడ్డి, నవీన్ రెడ్డి, ఊరడి వెంకటేష్, తుంకి లక్ష్మయ్య, కొమ్ము వినోద్, మునిగొండ నవీన్, పిట్ల నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.


