గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం,,,,,. స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ

మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్

గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం,,,,,. స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ


హైద‌రాబాద్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) : 

 ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ  దేవాలయాన్ని  గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు  వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని  ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న‌ల మేర‌కు ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో పంచాయితీరాజ్  శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్.సి. అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ తో క‌లిసి మంత్రి గారు స‌మీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌కు  మంత్రులు సూచించారు.  భక్తులకు మరింత సౌకర్యవంతముగా ఉండేలా చేపట్టే ఆధునీకరణ పనుల్లో గిరిజనుల సాంప్రదాయాలను  ప్రతిబింబించేలా ఉండాలని, ఈ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఇప్పటికే మేడారం ఆల‌యాల‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప‌రిశీలించార‌ని, వచ్చే వారంలో ముఖ్యమంత్రి గారు  స్వయంగా క్షేత్రస్ధాయి ప‌రిశీల‌న‌కు వ‌స్తున్నందున త‌గు ప్రణాళిక‌లు, స‌మాచారంతో  సిద్దంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో   పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇత‌ర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More ఖరీఫ్ సీజర్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి : జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం