గిరిజనుల దేవత జంగుబాయి  జాతర

 సంబరాలలో ఆదివాసులు

గిరిజనుల దేవత జంగుబాయి  జాతర

 

ఆదిలాబాద్ జిల్లా జనవరి 07 ( ప్రజాస్వరం)

ఆదివాసీలకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది, అడవే వారి జీవనాధారం,వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు అన్నీప్రకృతితో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు, ఈజాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలైనెల రోజుల పాటు కొనసాగుతుంది, వివిధ రాష్ట్రాలనుంచి లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారు.వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ జాతర, వారి జీవనశైలికి ఆదివాసీసంస్కృతికి అద్దం పడుతుంది, వారి నమ్మకాలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రసరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిమండలం మహరాజ్ గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగుబాయిఅమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలోప్రతి ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలైన గొండులు,పర్దాన్, కోలాం తెగలకు చెందిన ప్రజలు దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రంలో 8 గోత్రాల కటోడాలు సంప్రదాయం ప్రకారం కఠిన నియమాలతో జాతర పూర్తయ్యేదాకా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

దీపోత్సవంతో మొదలు

ఎనిమిది గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో ముందుగా దీపోత్సవంతో ప్రారంభిస్తారు. తుమ్రం, కొడప, సలాం,రాయిసిడాం, హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఎనిమిది గోత్రాల కటోడాలు (పూజరులు) తొలిరోజుకాలినడకన పూజా సామగ్రి తీసుకెళ్లి అదే రోజు రాత్రిదీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలుకొనసాగిస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో ఆదివాసీలుఉదయం తమ ఇండ్ల ముందు ఆవుపేడతో అలుకు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాళ్లకి చెప్పులు కూడా వేసుకోరు.నేలపైనే పడుకుంటారు. మద్యం అసలే ముట్టుకోరు.కనీసం హోటల్లో నీటిని కూడా ముట్టుకోరు. ఇంటినుంచి కాలినడకన ఆలయానికి చేరుకుం టారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సివస్తే గంపను నేలపై ఉంచ కుండా మూడు బండలనుపేర్చి గో మూత్రంతో శుభ్రం చేసిన తర్వాత రాళ్లపైపెడతారు.జాతరకు వెళ్తూ మధ్యలో టోప్లకస (కోనేరు)లో పుణ్యస్నానాలు చేసి ఆలయానికి చేరుకుంటారు.

నైవేద్య సమర్పణ

ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వులనూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వులనూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, ఆగరవర్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ,గులాలు, వంట సామగ్రి పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరంమైసమ్మ, పోచమ్మ, రావుర్క్ వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసిఆట పాటలతో అమ్మవారిని ఆరాధిస్తుంటారు.

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..