50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి....
మహేశ్వర్ రెడ్డి.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : హైదరాబాద్, ఏప్రిల్ 15
డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాలే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల నాడు ఆంధ్రప్రదేశ్లో ఒక లోక్ సభ సీటు తగ్గిందని గుర్తు చేశారు.జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు వస్తాయని, డీలిమిటేషన్ తర్వాత అయితే 270కి పైగా సీట్లు వస్తాయని తెలిపారు.
Latest News
25 Apr 2026 12:30:21
మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసింది.. ప్రజాస్వరం : చేగుంట , ఏప్రిల్ 25 ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని...


