ప్రజ సేవకే నా జీవితం అంకితం...
కౌన్సిలర్ అభ్యర్ధి ఎం.డి.ఆరిఫ్
మేడ్చల్, జనవరి 30 (ప్రజాస్వరం): 20 ఎండ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎల్లంపేట మున్సిపాలిటీ 23 వ వార్డు డబిల్పూర్ కౌన్సిలర్ అభ్యర్థిగా పార్టీ తనను ఎన్నికల బరిలో నిలిపిందని కౌన్సిలర్ అభ్యర్థి ఎండి ఆరిఫ్ అన్నారు. నేడు 23వ వార్డు డబిల్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించి భారత్ బైబిల్ కాలేజీలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ ఆరిఫ్ మాట్లాడుతూ.. తన తండ్రి పేరిట ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి, ప్రజల అవసరాలు, ప్రజాసేవకై మరింత విస్తృతంగా పనిచేస్తానని చెప్పారు. కరోనా సమయంలోను ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు అన్ని విధాల సహాయంగా ఉండటం జరిగిందని అన్నారు. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


