మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి

కొణిజేటి రోశయ్య ప్రజా ప్రతినిధిగా గొప్ప సేవలు అందించారు.

కలెక్టర్ రాహుల్ రాజ్.

Read More అటవీ,రెవిన్యూ భూమాలపై జాయింట్ సర్వే చేయాలి

మెదక్ జూలై 04 (ప్రజా స్వరం)

Read More నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు

కొణిజేటి రోశయ్య ప్రజా ప్రతినిధిగా గొప్ప సేవలు అందించారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడలు శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇతర రాష్ట్రాలకు గవర్నర్ గా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితమైందని ఆయన సేవలను గుర్తు చేశారు. ఆచరణలో సాధారణత, పరిపాలనలో ప్రతిభ ఆయన ప్రత్యేకతని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది రోశయ్య సేవల్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగరావు, యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More ఎంపీ రఘునందన్ త్వరగా కోలుకోవాలని పూజలు