ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి

ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి

హైదరాబాద్, (ప్రజాస్వరం) : 


బెట్టింగ్ యాప్ కేసు విచార‌ణ‌లో భాగంగా న‌టి మంచు లక్ష్మి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న‌ ఈడీ కార్యాల‌యం ముందుకు హాజ‌రైయారు.బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు మూడు గంట‌ల పాటు ల‌క్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్ర‌మోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవిల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై లక్ష్మి స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. అలాగే యాప్ ప్ర‌మోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. అనంత‌రం త‌న బ్యాక్ స్టేట్‌మెంట్లను లక్ష్మి ఈడీకి అందించింది. ఇక విచార‌ణ అనంతరం ల‌క్ష్మి ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా విచారణకు రావాలని మంచు ల‌క్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..