ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి

ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి

హైదరాబాద్, (ప్రజాస్వరం) : 


బెట్టింగ్ యాప్ కేసు విచార‌ణ‌లో భాగంగా న‌టి మంచు లక్ష్మి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న‌ ఈడీ కార్యాల‌యం ముందుకు హాజ‌రైయారు.బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు మూడు గంట‌ల పాటు ల‌క్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్ర‌మోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవిల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై లక్ష్మి స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. అలాగే యాప్ ప్ర‌మోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. అనంత‌రం త‌న బ్యాక్ స్టేట్‌మెంట్లను లక్ష్మి ఈడీకి అందించింది. ఇక విచార‌ణ అనంతరం ల‌క్ష్మి ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా విచారణకు రావాలని మంచు ల‌క్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు

Read More నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి