ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్
By Prajaswaram
On
హైదరాబాద్ (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు సురక్షితంగా దించారు. పఠాన్కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్ను సురక్షితంగా కిందకు దించారు.ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Latest News
06 Jul 2025 13:42:12
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...